Saturday, May 18, 2024

ఆగి ఉన్న కంటైన‌ర్ తో లారీ ఢీ – ఇద్ద‌రు స‌జీవ ద‌హ‌నం ..

మెదక్‌ జిల్లా నార్సింగి మండలం కాస్లాపూర్‌ వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్‌ లారీని వెనుక నుంచి వచ్చిన మరో కంటైనర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో మంటలు చెలరేగడంతో ఇద్దరు సజీవదహమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బెంగళూరు నుంచి సామగ్రితో ఓ కంటైనర్‌ లారీ నాగ్‌పుర్‌ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో నార్సింగి మండలం కాస్లాపూర్‌ వద్ద రోడ్డు పక్కనే టైరు పేలి ఆగి ఉన్న మరో కంటైనర్‌ను అదుపుతప్పి ఢీకొట్టింది. దీంతో బెంగళూరు నుంచి వస్తున్న లారీలోని నాగరాజు(25), బసవరాజు(24) సజీవదహనమయ్యారు.

సమాచారం అందుకున్న రామాయంపేట అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై సీఐ లక్ష్మీరాజు, నార్సింగి ఎస్సై నర్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement