Saturday, April 27, 2024

TS | 29న బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 29న సిద్దిపేట నియోజకవర్గంలో బీఆర్ ఎస్ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకులు మారెడ్డి రవీందర్ రెడ్డి, కడవారెలు రాజనర్సు, పాల సాయిరాం తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు సుపరిచితుడు, ఉన్నత విద్యావంతుడు అయిన వెంకట్రామ్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

గతంలో మాదిరిగానే మెదక్ పార్లమెంట్ స్థానంపై ఎమ్మెల్యే హరీశ్ రావు నేతృత్వంలో గులాబీ జెండా ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేశారు. వంద రోజుల కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనపై ప్రజల్లో చర్చ మొదలైందన్నారు. ఆరోపణలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. ఎంపీ అభ్యర్థి పరిచయ కార్యక్రమంతో పాటు విస్తృత సమావేశంలో ఎమ్మెల్యే హరీశ్ రావు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement