Friday, May 17, 2024

స్కూటీ, కారు ఢీ.. ముగ్గురు విద్యార్థులకు గాయాలు

పటాన్ చెరు, ప్రభ న్యూస్ : స్కూటీ, కారు ఢీకొన్న ఘ‌ట‌న సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో చోటుచేసుకుంది. ఐడిఏ బొల్లారం సర్వీస్ రోడ్ లో స్కూటీని కారు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో విద్యార్థులు అర్జున్, ప్రేమ్, ప్రవీణ్ కుమార్ కు గాయాల‌య్యాయి. స్థానిక బీజేపీ నేత ఆనంద్ కృష్ణారెడ్డి విద్యార్థులను తన సొంత వాహనంలో మమత హాస్పిటల్ కి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు సర్వీస్ రోడ్ లో ఓవర్ స్పీడ్ గా రావడంతో ఈ ప్రమాదం సంభవించిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement