Thursday, May 16, 2024

పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలి… రిలే నిరాహార దీక్షకు దిగిన వీఆర్ఏలు..

సంగారెడ్డి : ప్రభుత్వం వెంటనే పే స్కెల్ జీవోను విడుదల చేసి వీఆర్ఏ లను ఆదుకోవాలని కోరుతూ సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా వీఆర్ఏల సంఘం రిలే నిరాహార దీక్షలకు దిగింది. సంగారెడ్డి జిల్లా వీఆర్ఏ ల సంఘం ఆధ్వర్యంలో
ప్ల కార్డులు పట్టుకుని కలెక్టర్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు దిగారు. ముక్యంగా అర్హత కల్గిన వీఆర్ఏలందరికి ప్రమోషన్స్ ఇవ్వాలని, 55 సంవత్సరాలు పై బడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, రిటైర్డ్ అయ్యిన వీఆర్ఏలకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, పే స్కేల్ ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా వీఆర్ఏ లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement