Wednesday, May 1, 2024

దొంగ‌ల బీభ‌త్సం.. ఇంటి తాళాలు ప‌గుల‌గొట్టి చోరీ…

వెల్దుర్తి : మాసాయిపేట మండల పరిధిలోని రామంతపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని దొంగలు ఐదు ఇండ్ల తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడ్డారు. గన్నేరుల యాదగిరి ఇంట్లో లక్షన్నర నగదు, క్వింటాలున్నర బియ్యం, మ‌రో ఇంట్లో నాలుగు సెల్ ఫోన్లు, 50 వేల నగదు, కర్రోల శివ గౌడ్ ఇంట్లో టీవీ చోరీ చేశారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు మెదక్ నుండి వచ్చిన క్లూస్ టీం సిబ్బంది చోరీ జరిగిన ఇండ్లలో ఆధారాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement