Friday, May 3, 2024

ప్ర‌భాస్ అప్ప‌టికి ఇప్ప‌టికీ ఏం మార‌లేదు.. న‌య‌న‌తార‌

పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ అప్ప‌టికీ..ఇప్ప‌టికీ ఏం మార‌లేద‌ని కామెంట్ చేసింది స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార‌. కాగా ప్రస్తుతం హార్రర్ ఫిల్మ్ ‘కనెక్ట్ తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది న‌య‌న‌తార‌. ఈ చిత్రం డిసెంబర్ 22 తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు ఆడియెన్స్ కోసం ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజపై ఫన్నీ కామెంట్స్ చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నయనతార ‘యోగి’ చిత్రంలో నటించింది. అయితే అప్పటికి.. ఇప్పటికీ ప్రభాస్ ఏం మారలేదని.

ఆయనది పిల్లాడి మనస్థత్వమని తెలిపింది. ప్రభాస్ అల్లరిని తట్టుకోవడం కష్టమని చెప్పుకొచ్చింది. అలాంటి ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం సంతోషంగా ఉందని తెలిపింది. కాగా నయనతార ‘కనెక్ట్’ మూవీ ట్రైలర్ ను ప్రభాస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా సెట్స్ లో చాలా హుందాగా, జాలీగా ఉంటారని తెలిపింది. ఎన్టీఆర్ డాన్స్ అంటే చాలా ఇష్టమని, రిహార్సల్ లేకుండా షూట్ కు వెళ్లడం గొప్పవిషమన్నారు. ఇలాంటి హీరో ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఒక్కరే ఉన్నారని తెలిపింది. సూపర్ టాలెంటెడ్ అంటూ పొగిడేసింది. ఇక మాస్ మ‌హారాజ్ రవితేజ గురించి మాట్లాడుతూ.. రవితో ఎప్పుడూ హిందీలో మాట్లాడుతూ ఉంటానని తెలిపింది. హీరో బాలకృష్ణ‌తో కలిసి పనిచేయడం ఎప్పటికీ మరిచిపోలేని ఫీలింగ్ అని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement