Friday, April 26, 2024

ఆర్థిక సహాయం అందజేసిన సర్పంచ్‌..

చేగుంట : మండలం చందాయిపేట గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన చింతకింది కొమురయ్య కుటుంబానికి గ్రామ సర్పంచ్‌ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్‌ ఆర్థిక సహాయం అందజేశారు. ఆ కుటుంబాన్ని ఓదార్చి తోచిన సహాయంగా 50 కిలోల బియ్యం, రెండువేల నగదు అందజేశారు. కొమురయ్య కుటుంబం నిరుపేద కుటుంబం అయినందున తమవంతు సహకారాన్ని అందిస్తున్నామని అన్నారు. అలాగే గ్రామంలోని పేద కుటుంబాలకు ఆపద కలిగితే ఆదుకుంటున్నామని తెలిపారు. సఫాయి కార్మికులకు సామాగ్రి పంపిణీ కూడా చేశారు. చందాయిపేటలో సఫాయి కార్మికులకు సామాగ్రి పంపిణీ చేసినట్లు సర్పంచ్‌ స్వర్ణలత భాగ్యరాజ్‌ పేర్కొన్నారు. కరోనా వ్యాధి విజృంభిస్తున్నందున సఫాయి కార్మికుల బాగోగుల కోసం మాస్కులు, శానిటైజర్‌, సబ్బులు, ఇతర సామాగ్రి పంపిణీ చేసినట్లు వారు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement