Sunday, April 28, 2024

MDK: రైతులకు ఎకరాకు రూ.15వేల నష్టపరిహారం… మైనంపల్లి రోహిత్

ఉమ్మడి మెదక్ బ్యూరో : ఇటీవల మెదక్ నియోజకవర్గంలోని నిజాంపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో భారీ గాలులతో వడగండ్ల వాన కురిసిన విషయం విధితమే… ఈ విషయమై మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ మెదక్ నియోజక వర్గంలోని నిజాంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ముఖ్యంగా వరి పంటతో పాటు మొక్కజొన్న పంట పూర్తి స్థాయిలో దెబ్బతిన్న విషయాన్ని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళారు.

తక్షణమే జిల్లా కలెక్టర్ తో పాటు వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించి పంట నష్టపోయిన వివరాలను సేకరించాలని సూచించారు. ఇదిలా ఉండగా హైద‌రాబాద్ లోని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావ్ తో మెదక్ నియోజక వర్గంపై సమీక్ష నిర్వ‌హించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement