Friday, May 3, 2024

రోడ్డుపై ఉన్న గుంతల్లో నాట్లు వేస్తూ నిరసన…

సదాశివపేట పట్టణం లోని సిద్దాపూర్ కాలనీకి వెళ్లే రోడ్డును తక్షణమే బాగు చేయాలని నిర‌సిస్తూ సీపీఎం నాయ‌కులు రోడ్ల‌పై వ‌రి నాట్లు వేసి నిర‌స‌న వ్య‌క‌ర్తం చేశారు. వర్షాలు పడితే చెరువుల మారే ఈ రోడ్డు ప్రజలు నడవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంట‌నే మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టాల‌ని సీపీఎం సదాశివపేట ఏరియా కార్యదర్శి వి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. గతంలో 40 లక్షలు పెట్టి ఈ రోడ్డును మరమ్మత్తులు చేశామని చెప్పుకున్న ప్రభుత్వ యంత్రాంగం మళ్లీ యధాస్థితికే వచ్చిందన్నారు. మూడు నెలలు కాకముందే మళ్లీ రోడ్డు గుంతల మయంగా మారి ప్రజలు నడవడానికి ఉపయోగకరంగా లేకుండా తయారైందన్నారు. 40 లక్షల రూపాయలు వృధా అయిపోయినాయి అన్నారు. వెంట‌నే రోడ్డును బాగుచేయించాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement