Saturday, May 4, 2024

ప్రజలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు.. కాంగ్రెస్ నేత ఐలయ్య

అక్కన్నపేట, జులై 20 (ప్రభన్యూస్) : రాష్ట్రంలోని కేసీఆర్ సర్కార్ ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచాక ఇచ్చిన హామీలను మరిచిన కేసీఆర్ సర్కార్ కు త్వరలో జరగబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐలయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం రైతు రుణమాఫీ నిరుద్యోగ భృతి ఇలా అనేక హామీలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. 9 ఏళ్ల పాలనలో పేద ప్రజలకు గూడు నిర్మించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. 30ఏళ్ల క్రితం నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లలోనే ప్రజలు జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇండ్లు లేని పేద ప్రజలకు ఇండ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అంటూ గొప్పలు చెబుతున్న ప్రభుత్వం దగా, మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ప్రభుత్వం 57 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ అందిస్తామని మాట ఇచ్చినా.. అది కూడా పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనమన్నారు. ఇలా అనేక హామీలు ఇచ్చి ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ ప్రజల ముందుకు రాబోతున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని కేసీఆర్ సర్కార్ కు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement