Sunday, April 28, 2024

MDK: అధికారులు అంకితభావంతో పనిచేయాలి.. కలెక్టర్ వల్లూరు క్రాంతి

సంగారెడ్డి, జనవరి 26 (ప్రభ న్యూస్) : జిల్లా అధికారులు, ఉద్యోగులు అంకితభావంతో పనిచేసి జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పిలుపునిచ్చారు. శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సమీకృత కలెక్టరేట్ సముదాయంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరేలా నిబద్దతతో కృషి చేయాలన్నారు. అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్, చాక్లెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, జిల్లా అధికారులు, ఉద్యోగులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పతాకావిష్కరణ చేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంగారెడ్డి ఆర్డీవో, తహసిల్దార్, క్యాంపు కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement