Monday, April 29, 2024

కేసీఆర్‌ కోలుకోవాలని మృత్యుంజయ యజ్ఞం..

వర్గల్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కాంక్షిస్తూ వర్గల్‌ విద్యాధరి క్షేత్రంలో ఆలయ వ్యవస్థాపక చైర్మన్‌ యాయవరం చంద్రశేఖరశర్మసిద్ధాంతి పర్యవేక్షణలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో నవగ్రహ నక్షత్ర శాంతి దన్వంతరి మృత్యుంజయ యజ్ఞాన్ని జరిపించారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి కేసీఆర్‌ త్వరగా ఆయురారోగ్యాలతో బయటకు రావాలని అమ్మవారిని పూజించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లతరమేశ్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీ బాల్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ రామకృష్ణారెడ్డి, వర్గల్‌ మండల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు నాగరాజు, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు సంతోషవెంకటేశ్‌, వేదపండితులు అనంతగిరిశర్మ, ప్రవీణ్‌శర్మ, శశిధర్‌శర్మ, నాగరాజుశర్మ, వంశీశర్మ, సంతోష్‌శర్మ, రాఘవేందర్‌, రఘుపవన్‌తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement