Friday, May 3, 2024

ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

అమీన్పూర్ : మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందిస్తున్నామని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మండల పరిధిలోని జానకంపేట గ్రామంలో రూ.20 లక్షల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన మిషన్ భగీరథ ట్యాంక్ నిర్మాణ పనులకు, కిష్టారెడ్డిపేట గ్రామంలోని వెంకటరమణ కాలనీ, లక్ష్మీ నగర్ కాలనీలలో జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ సౌజన్యంతో 70 లక్షల రూపాయల అంచనా వ్యయంతో తలపెట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. మిషన్ భగీరథ ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తున్నామని తెలిపారు. నూతన కాలనీలకు సైతం ప్రణాళికబద్ధంగా మంచినీరు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో జెడ్పిటీసీ సుధాకర్ రెడ్డి, సర్పంచులు కృష్ణ, పాండు యాదవ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజు, సీనియర్ నాయకులు సత్యనారాయణ, రాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement