Friday, May 3, 2024

వివాహిత ఆత్మ‌హ‌త్య‌

భ‌ర్త‌తో పాటు అత్త‌మామ‌ల వేధింపులు భ‌రించ‌లేక ఓ వివాహిత ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ విషాద ఘ‌ట‌న తుప్రాన్ మండ‌లం కిష్టాపూర్ గ్రామంలో సోమ‌వారం రాత్రి చోటు చేసుకుంది. విద్య (24) అనే మ‌హిళ త‌న భ‌ర్త నిత్య వేధింపుల‌కు గురి చేస్తున్నాడు. అత్త‌మామ‌లు కూడా ఆమెను మాన‌సికంగా హింసిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సోమ‌వారం రాత్రి భ‌ర్త‌తో దివ్య‌కు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన బాధితురాలు పురుగుల మందు తాగింది. ఈ ఘ‌ట‌న‌ను గ‌మ‌నించిన కుటుంబ స‌భ్యులు ఆమెను చికిత్స నిమిత్తం హైద‌రాబాద్‌లోని ఓ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ దివ్య మృతి చెందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement