Friday, May 10, 2024

మంత్రి కేటీఆర్ ను కలిసిన ఇల్లందు ఎమ్మెల్యే

ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ను ఈరోజు క‌లిశారు. ఇల్లందు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను కోరడం జరిగింది. ముఖ్యంగా ఇల్లందు డీఎస్పీ ఆఫీస్ నుండి కరెంట్ ఆఫీస్ వరకు బీటీ రోడ్డుకు 10 కోట్ల రూపాయలను మంజూరు చేయాలని కోరడం జరిగింది. ఎమ్మెల్యే కోరిన వెంటనే నిధులు విడుదల చేస్తామని తెలియజేసిన మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement