Saturday, May 4, 2024

లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి కృషి..

తూప్రాన్ : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర జూనియర్‌ కళాశాలల లెక్చరర్ల అసోసియేషన్‌ ఫైనాన్స్‌ కార్యదర్శి లక్ష్మీ అన్నారు. తూప్రాన్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఆమెను ఘనంగా సన్మానించారు. ఇటీవల జరిగిన సమావేశంలో ఆమెను రాష్ట్ర ఫైనాన్స్‌ కార్యదర్శిగా నియమించారు. తూప్రాన్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కామర్స్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్న లక్ష్మీ రాష్ట్ర ఫైనాన్స్‌ కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర జూనియర్‌ కళాశాలల లెక్చరర్ల సంఘం అధ్యక్షులు మధుసూధన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాలతో సత్కరించారు. అనంతరం లక్ష్మీ మాట్లాడుతూ తమపై నమ్మకంతో పదవి అప్పగించిన ప్రతి ఒక్కరికి ఎంతో రుణపడి ఉంటానని చెప్పారు. జూనియర్‌ లెక్చరర్ల సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్‌ జిల్లా ప్రిన్సిపాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కృష్ణారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్‌ సూర్యప్రకాష్‌, లెక్చరర్లు గోపి, నాగరాణి తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement