Wednesday, May 8, 2024

Medak: అవయవదానంతో ‘చిరంజీవి’

నిజాంపేట, జులై 10 (ప్రభ న్యూస్) : రోడ్డుప్రమాదంలో గాయపడి మరణించిన ఓ యువకుడు తల్లిదండ్రులు అవయవదానం చేసి ఆదర్శంగా నిలిచారు. మెదక్ జిల్లా నిజాంపేట, మండల పరిధిలోని వెంకటాపూర్ కె గ్రామానికి చెందిన గైసింగారంరాజు ఏకైక కుమారుడు రాకేష్ వయస్సు (19) శుక్రవారం రోజు కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం బస్వాపూర్ గ్రామం గేట్ సమీపంలో బైకుఫై వస్తుండగా కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడడంతో చికిత్స కోసం కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించగా.. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కి తరలించారు. పరిస్థితి విషమించి చికిత్స పొందుతున్న రాకేష్ ఆదివారం మధ్యాహ్నం మరణించాడు.

అంతకు ముందు రాకేష్ బతికే అవకాశాలు లేవని, అవయవదానం చేయాలని అతని తల్లిదండ్రులను కోరారు. అందుకు వారు అంగీకరించడంతో వైద్యులు సర్జరీ ద్వారా ముఖ్యమైన అవయవాలు వేరుచేసి.. వేరేవారికి అమర్చి ప్రాణదానం చేశారు. అవయవ దానాన్ని చేసిన మృతుని పార్థివ దేహానికి హాస్పటల్ సిబ్బంది గౌరవ వందనం చేశారు.ఈ కార్యక్రమంలో హాస్పిటల్ యాజమాన్యం, బీఆర్ఎస్ నాయకులుకాశ బోయినదయాకర్, మాజీ సర్పంచ్ ధర్మ రెడ్డి, బైండ్ల నందు, రాజేందర్, స్వామి, ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement