Monday, April 29, 2024

గ్రామ గ్రామాన అంబేద్కర్ జయంతి ఉత్సవాలు..

మునిపల్లి :  అందరివాడు అంబేద్కర్ అని   స్థానిక జడ్​పిటిసి  పైతర మీనాక్షి సాయికుమార్​  అన్నారు.  మండల కేంద్రమైన  మునిపల్లితోపాటు ఖమ్మంపల్లి, తక్కడపల్లి ,  మల్లికార్జున్​ పల్లి, అల్లాపూర్​ ఆయా గ్రామాల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి ఉత్సవాలను   ఘనంగా నిర్వహించారు.  మండల కేంద్రమైన మునిపల్లితోపాటు  ఖమ్మంపల్లి, మల్లికార్జునపల్లి, తక్కడపల్లి తదితర గ్రామాల్లో   అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.  ఈ కార్యక్రమాల్లో  టీఆర్​ఎస్​  రాష్ట్ర నాయకుడు పైతర సాయికుమార్ , గ్రామ సర్పంచ్  జాస్మిన్ గుడ్డుపటేల్ ,  ఎంపీటీసీ  శివలీల మల్లన్న , ఉపసర్పంచ్ తుడుం శాంతమ్మ సుభాష్, మాజి ఉపసర్పంచ్ తుడుం దుర్గయ్య,  పీఏసీఎస్​ మాజి డైరెక్టర్ కలాల్ యాదయ్య గౌడ్,  నాయకులు మ్యాతరి మాణెయ్య పంచాయతీ కార్యదర్శి నర్సింలు,  అంబేద్కర్​ సంఘం  గ్రామ అధ్యక్షుడు  తుడుం రాజేందర్​,  నాయకులు శివరాజ్ పాటిల్, టీజీఎస్​ అధ్యక్షుడు, తెరాస నాయకులు  మాసుల నజీర్, గోపులారం  ఎంపీటీసీ పాండు, అడ్వకేట్ వీరన్న,  సంఘం అధ్యక్షులు బేగరి మాణయ్య,  నాయకులు కొలుకూరి శంకరయ్య,  కొల్కూరి శ్రీశైలం, ఉప సర్పంచ్ మాణెమ్మ నాగయ్య, బాలయ్య, కాశయ్య, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement