Thursday, May 2, 2024

వేతనాలు పెంచాలని ప్రభుత్వ ఆస్ప‌త్రి సెక్యూరిటీ గార్డుల‌ ఆందోళన

సంగారెడ్డి: సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే సెక్యూరిటీ గార్డులు తమ వేతనాలు పెంచాలని బుధవారం ఆసుపత్రి ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. సిఐటీయూ ఆధ్వర్యంలో సెక్యూరిటీ గార్డులు అంతా ఏకమై ఆందోళన చేపట్టారు. ఫలితంగా ఆసుపత్రికొచ్చే పేషెంట్స్ క్రమ పద్ధతిని తప్పారు. అసలే కోవిడ్ విజృంభిస్తున్న స‌మ‌యంలో భౌతిక దూరం పాటించక‌పోవ‌డం ప్రమాద ఘంటిక‌లు మోగించ‌డ‌మేన‌ని సర్వత్రా అభిప్రాయ పడుతున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంటనే స్పందించి సమస్య ను పరిష్కరించాలని కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement