Sunday, May 5, 2024

MDK : సంగారెడ్డిజిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఇద్ద‌రు మృతి

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పటాన్​చెరులో మండలంలోని కర్థనూరులో గుర్తు తెలియ‌ని ఓ వాహనం కారును ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం హైటెక్ సిటీ యశోద ఆస్పత్రికి తరలించారు.

మృతులు నల్గొండ జిల్లాకు చెందిన లుమాన్ అలీ, వాజిద్ అలీగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాద ఘటనపై బిడిఎల్ బానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement