Thursday, April 25, 2024

రెండో దఫా కరోనా టీకా..

చేగుంట : ప్రాజెక్టు పరిధిలోని ఆరు మండలాల అంగన్‌వాడీ కేంద్రాలలో రెండో దఫా కరోనా టీకాలు వేయించుకున్నట్లు ఇంచార్జీ సిడిపిఓ సువర్ణశైని తెలిపారు. ఇందులో చేగుంట, నార్సింగి, వెల్దుర్తి, కొత్తగా ఏర్పడిన మాసాయిపేట, చిన్నశంకంరపేట, రామాయంపేట, నిజాంపేట మండలాల అంగన్‌వాడీ టీచర్లు, ఆయమ్మలు ఉన్నారని ఆమె తెలిపారు. కొంతమంది ఆరోగ్య రీత్యా మందులు వాడుతున్నందున టీకా వేసుకోలేదని సిడిపిఓ తెలిపారు. కరోనా విజృంభిస్తున్నందున సెంటర్లలో మాస్కులు తప్పకుండా వినియోగించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement