Sunday, April 28, 2024

MDK: నిజాంపేట మండలంలో బీఆర్ఎస్ స‌ర్పంచ్ లు కాంగ్రెస్ లో చేరిక..

నిజాంపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బుధవారం నిజాంపేట మండలంలోని నార్లాపూర్ సర్పంచ్ అమరసేనా రెడ్డి, చల్మెడ సర్పంచ్ నర్సింహ్మ రెడ్డి, రజాక్ పల్లి సర్పంచ్ నాగరాజులతో పాటు నిజాంపేట ఎంపిపి సిద్దిరాములు, తిప్పన్నగుల్ల మాజీ సర్పంచ్ యాదగిరిలతో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా అవినీతిమయమైంద‌ని, ఏ పల్లె చూసినా అభివృద్ధికి నోచుకోలేక పోయిందని వారు విమర్శించారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన డా.మైనంపల్లి రోహిత్ వంద రోజుల్లోనే చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులమై బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వారు పేర్కోన్నారు. అదేవిధంగా త‌మ పార్టీ కార్యకర్తలు, నాయకులను సైతం త్వరలోనే నియోజకవర్గ ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ సమక్షంలో కాంగ్రెస్ చేర్పించనున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement