Tuesday, May 14, 2024

రోగుల‌కు మెరుగైన వైద్యం అందించాలి : క‌లెక్ట‌ర్ శ‌ర‌త్‌

సదాశివపేట : పేట ప్రభుత్వ ఆసుపత్రిని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో సదుపాయాల గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సేవలు అందించాలని, అదేవిధంగా ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు మెరుగైన వైద్యం అందజేయాలని హెచ్చరించారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ రాజర్షి షా, పురపాలక సంఘం పిల్లోడి విశ్వనాథన్, సూపరిండెంట్ సత్యనారాయణ, డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement