Tuesday, April 30, 2024

సిద్దిపేట జిల్లాలో దారుణం : యువకుడి దాడి.. వృద్ధుడి మృతి..

సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జగదేవ్ పూర్ మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన తొవరి యాదగిరి పై గురువారం రాత్రి అదే గ్రామానికి చెందిన యువకుడు దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయాల పాలైన యాదగిరి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గజ్వేల్ హాస్పిటల్ కి తరలించారు. దాడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement