Saturday, May 4, 2024

అంబేద్కర్‌ ఆశయాల కోసం కృషి..

పెద్దశంకరంపేట : రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి స్కైబాల్‌ బాబు, కేవీపీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాణిక్యంలు అన్నారు. పెద్దశంకరంపేట మండలం బూర్గుపల్లిలో అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాుట చేసిన అంబేద్కర్‌ విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పేందుకు అంబేద్కర్‌ రూపొందించిన రాజ్యాంగం ఫలితంగానే దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలు అభ్యున్నతి సాధిస్తున్నారన్నారు. అంబేద్కర్‌ కళలను సాకారం చేసేందుకు కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరు ఆయన సూచించిన మార్గంలో నడవాలన్నారు. గ్రామంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సరితా మల్లేశం, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం, కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షులు తుకారం, ఎంపీటీసీ రాజు, యువజన సంఘాల నాయకులు సంగమేశ్వర్‌, సాయిలు, బేతయ్య, కిష్టయ్య, దుర్గయ్య ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement