Saturday, May 4, 2024

Medak – లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన వైద్య శాఖ ఉద్యోగి

మెదక్ ప్రతినిధి:ప్రభ న్యూస్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు డీఎం‌హెచ్‌ఓ ఉద్యోగి పట్టుబడిన సంఘటన మెదక్ జిల్లా కేంద్రంలో గురువారం జరిగింది. మెదక్ డీఎంహెచ్ఓ కార్యాలయంలో కమ్యూనిటీ హెల్త్ అధికారి గా ఉన్న ఫహిం పాషా ఒకరి వద్ద లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. మెదక్ పట్టణంలోని బావార్చి హోటల్ సమీపంలో రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

. ఏసీబీ అధికారులను గుర్తించిన ఫాహిం పాషా పారిపోయే ప్రయత్నం చేయగా అధికారులు వెంటబడి పట్టుకొని డీఎంహెచ్ఓ కార్యాలయానికి తరలించి విచారణ జరుపుతున్నారు. ఏసీబీ కి చిక్కిన ఫాహిం పాషా ఇంట్లోనూ బిసోదాలు కొనసాగుతున్నాయి. ఇంకా ఏసిబి అధికారులు సోదాలు కొనసాగుతూనే ఉన్నాయని,వివరాలు వెల్లడించడానికి సమయం పడుతుందని ఏసిబి డిఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement