Tuesday, April 30, 2024

హైవేపై ప్రమాదాల నియంత్రణకు చర్యలు.. 24 గంట‌ల‌పాటు పెట్రోలింగ్‌

పెద్ద‌ప‌ల్లి: రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదాల నియంత్రణకు హైవే పెట్రోలింగ్ 24 గంటల పాటు నిర్వహిస్తున్నామని పెద్దపల్లి ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం త‌న కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజీవ్ రహదారిపై ప్రతినిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగడం వల్ల ఎంతోమంది మృతి చెందడంతో పాటు క్షతగాత్రులవుతున్నారాన్నారు. ప్రమాదాల నియంత్రణ కోసమే ఇటీవల పెద్దపెల్లి ఏసీపీ సారంగపాణి ఆధ్వర్యంలో సబ్ డివిజన్ పరిధిలోని 35 కిలోమీటర్ల రాజీవ్ రహదారిపై 24గంటల పాటు హైవే పెట్రోలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు.

హైవే పెట్రోలింగ్ వల్ల కొన్ని రోజులుగా రోడ్డు ప్రమాదాలు తగ్గాయని, వివిధ కారణాలతో రహదారులపై నిలిచిన వాహనాలను తొలగిస్తున్న‌ట్టు సీఐ తెలిపారు. వాహనదారులకు అత్యవసర సమయాల్లో తమ సిబ్బంది సేవలు అందిస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో హైవే పెట్రోలింగ్ మరింత పటిష్టంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పెద్దపల్లి ఎస్సై రాజేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement