Sunday, April 28, 2024

Hyd | ఎంబీబీఎస్ స్టూడెంట్‌ దీక్షిత్‌ రెడ్డి ఆత్మహత్య.. మాన‌సిక రుగ్మ‌త‌లే కార‌ణం!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గాంధీ మెడిక‌ల్ కాలేజీలో చ‌దువుతున్న‌ వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం చదువుతున్న దీక్షిత్‌ రెడ్డి (21) ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డాడు. నగర శివారులోని పాపిరెడ్డి నగర్‌కు చెందిన దీక్షిత్‌ రెడ్డి కొంత కాలంగా మానసిక సమస్యలకు సంబంధించి చికిత్స చేయించుకుంటున్నారు. గతంలో ఒకసారి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నం చేశాడు. సకాలంలో ఆస్పత్రికి తీసుకుపోవడంతో బతికిబయటపడ్డారు.

అప్పటి నుంచి ఆయన ఇంటివద్దే ఉంటున్నాడు. ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో మర్మాంగం కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు తలుపు కొట్టినప్పటికీ తీయకపోవడంతో బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. రక్తపు మడుగులో దీక్షిత్‌ కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement