Sunday, April 28, 2024

Railway Alert: కాజీపేట మీదుగా వెళ్లే పలు రైళ్లు ర‌ద్దు…

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్లును ర‌ద్దు చేశారు. కాజీపేట మీదుగా వెళ్లే పలు రైళ్లు ర‌ద్ద‌య్యాయి. మౌలాలీ – సనత్‌నగర్‌ రైల్వే స్టేషన్ల మధ్య డబ్లింగ్‌, నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రైళ్లను రద్దు చేశారు.

ఈ నెల 11వ తేదీ వరకు కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేశామని, మరికొన్నింటిని పాక్షికంగా నడుపుతున్నామని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌- సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఇంటర్‌ సిటీ(17011/12), కాగజ్‌నగర్‌ సూపర్‌ఫాస్ట్‌ (12757/58), సికింద్రాబాద్‌- గుంటూరు ఇంటర్‌ సిటీ(12705/06) ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌- గుంటూరు శాతవాహన ఎక్స్‌ప్రెస్‌(12714/13), కాకతీయ ఎక్స్‌ప్రెస్‌(17659/60) పూర్తిగా రద్దు చేశారు. భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌(17233/14)ను, సికింద్రాబాద్‌- గుంటూరు మధ్య నడిచే 17201/02 గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ కాజీపేట నుంచి బయలుదేరుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement