Sunday, April 28, 2024

Manchirial – బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పై కేసు నమోదు

మంచిర్యాల – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసు నమోదు అయ్యింది.కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు మంచిర్యాల పోలీసులు. సోమవారం మంచిర్యాల జిల్లా బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్‌, సీఎం రేవంత్‌రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం హోదాలో రేవంత్‌ అనుచితంగా మాట్లాడారని అంటూనే.. ఈ క్రమంలో రేవంత్‌పై అసభ్య పదజాలం వాడారు ..

అంతేకాదు.. రేవంత్‌ను చెప్పుతో కొడతానంటూ ఆగ్రహంతో వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వెంటనే సంస్కారం అడ్డువస్తోందంటూ సర్దిచెప్పుకునే యత్నం చేశారాయన. ఆ ప్రసంగం వీడియో వైరల్‌ కావడంతో.. కాంగ్రెస్‌ నేతలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో బాల్క సుమన్‌పై సెక్షన్లు 294బీ, 504, 506 సెక్షన్లపై కేసు నమోదైనట్లు సమాచారం

బాల్క సుమన్ దిష్టి బొమ్మ దగ్దం

చెన్నూర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బాల్క సుమన్ చేసిన ఘాటు వాఖ్యాలను నిరసిస్తూ చెన్నూరు నియోజక వర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాల్క సుమన్ దిష్టి బొమ్మను దగ్దం చేశారు. స్థానిక అంబేద్కర్ చౌక్ లో సుమన్ చిత్ర పటానికి చెప్పుల దండలు వేసి సుమన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ దిష్టి బొమ్మను దగ్దం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement