Friday, May 10, 2024

Manchirial – పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2కే రన్

మంచిర్యాల టౌన్, జూన్ 12 (ప్రభన్యూస్): తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుండి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వరకు సాగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ లు ముఖ్య అతిథులుగా హాజరైన ప్రారంభించారు.

పాఠశాల మైదానానికి చేరుకున్న అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్, మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, సీఐలు, ఎస్సైలు, అధికసంఖ్యలో యువకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement