Monday, May 6, 2024

తెలంగాణ పోలీసు పాత్ర అమోఘం -ఎమ్యెల్యే విఠల్ రెడ్డి…

భైంసా- తెలంగాణా రాష్ట్రంలో పోలీసుల పాత్ర అమోఘమని ఎమ్యెల్యే విఠల్ రెడ్డ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 6 గంటలకు భైంసా మండల కేంద్రంలో నిర్వహించిన 2 కె రన్ లో శాసన సభ్యులు జి విఠల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నాయకులు,యువకులు,అధికారులతో కలిసి 2కె రన్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విఠల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో పోలీసుల పాత్ర చాలా గొప్పదని దేశంలో ఎక్కడ లేని విధంగా పోలీసులకు సౌకర్యాలు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ. కాంతిలాల్ పాటిల్, డా. నగేష్, డా. దామోదర్, వాడెకర్ లక్ష్మణ్, ముధోల్ సి.ఐ వినోద్ రెడ్డి, స్థానిక నాయకులు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement