Saturday, May 4, 2024

కేటిపిపి వద్ద భూ నిర్వాసితుడి ఆత్మహత్యయత్నం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చెల్పూర్ శివారు కాకతీయ ధర్మల్ విద్యుత్ ప్లాంట్లులో భూమి కోల్పోయి పదేళ్లవుతున్నా ఉద్యోగం ఇవ్వడం లేదంటూ ఓ వ్యక్తి కేటీపీపీ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. చెల్పూర్ సమీప గ్రామమైన మహబూబ్ పల్లి గ్రామానికి చెందిన మర్రి లింగయ్య కేటీపీపీ మొదటి ఫేజ్ లో భూమి కోల్పోయాడు. ఆ సమయంలో ఆయన కుమారుడు మైనర్ కావడంతో ఉద్యోగం ఇవ్వలేదు. మేజర్ అయిన తర్వాత ఇద్దాస్తామని చెప్పిన అధికారులు ఆరేళ్లుగా తిప్పుకుంటున్నారు. రోజు వచ్చి వెళ్తున్నా.. ఎవరూ పట్టించుకోవడంతో బాధితుడు లింగయ్య పురుగుల మందు తెచ్చుకొని కేటీపీపీ గేటు ఎదుట తాగాడు. అయితే, గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అతడిని సింగరేణి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషయమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ తరలిస్తున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement