Thursday, April 25, 2024

పండగ పూట విషాదం.. జగిత్యాలలో వ్యక్తి దారుణ హత్య

జగిత్యాల జిల్లా కేంద్రంలో పండగ పూట విషాదం చోటు చేసుకుంది. స్థానిక బీట్ బజార్ లోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో శుక్రవారం రాత్రి తోట శేఖర్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సెంట్రింగ్ పని చేస్తూ జీవించే శేఖర్ ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో విందు చేసుకున్నట్టు మద్యం సీసాలు ఉన్నాయి. ప్రత్యర్థులు యువకుడిని కత్తులతో పొడిచి చంపారు. బీట్ బజార్ లో పాస్ట్ పుడ్ సెంటర్ మద్యం తాగిన సమయం లో తోట శేఖర్ అనే యువకుడి పై కత్తులతో పొడిచారు. రక్తం మడుగులో పడి శేఖర్ అక్కడిక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి డిఎస్పీ ప్రకాష్ చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘ‌ట‌న‌కు పాత క‌క్ష‌లే కార‌ణ‌మ‌ని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: న్యూడ్ చాటింగ్‌తో ముగ్గులోకి..

Advertisement

తాజా వార్తలు

Advertisement