Thursday, April 25, 2024

వచ్చే ఏడాది డిసెంబరు నుంచే అయోధ్య రామయ్య దర్శనాలు

అయోధ్య గుడి నిర్మాణ పనులపై అయోధ్య శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ కీలక ప్రకటన చేసింది. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామమందిర నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొంది. ఇప్పటికే ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఫేస్ వన్ పనులు పూర్తికాగా ఫేస్ టు పనులు నవంబర్ చివరి నాటికి ముగుస్తాయని స్పష్టం చేసింది.

అలాగే డిసెంబర్ 2023 నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తామని… అదే సంవత్సరం ఆలయంలో శ్రీ రాముడి మూలవిరాట్టు ప్రతిష్టాపన చేయాలని భావిస్తున్నామని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తమ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. కాగా గత ఏడాది ఆగస్టు 5వ తేదీన ప్రధాని మోదీ అయోధ్య రామ మందిరానికి భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆలయ విశేషాలు వస్తే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన టెంపుల్ ఆర్కిటెక్ట్ సొమ్ పూరా ఫ్యామిలీ అయోధ్య రామ మందిర నిర్మాణ బాధ్యతలు స్వీకరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement