Sunday, April 28, 2024

kHM: ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలంలోని పద్మాపురం గ్రామానికి చెందిన సోలం నాగయ్య (65) ప్రమాదవశాత్తు చెరువులో పడి శుక్రవారం మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. మృతుడు సోలం నాగయ్య గేదెల కాపరిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగే గేదెలను మేతకు చెరువుగట్టుకు వెళ్ళాడు. గేదేలను మేపుకుంటూ చెరువు అంచుకు వెళ్ళాడు.

ఈ క్రమంలో కండ్లు తిరిగి చెరువుల్లో పడటంతో మృతిచెందడాని తెలిపారు. ఈ ఘటనపై కరకగూడెం పోలీసులకు సమాచారం అందిచడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పెద్ద దిక్కు కోల్పవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. కరకగూడెం మండల బీఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు రావుల సోమయ్య, రావుల శ్రీను, చిట్టిమల్ల ప్రవీణ్, చిట్టి సతీష్, గుర్రం లాలయ్య, ఇనుమల రామకృష్ణ సోలం నాగయ్య మృతికి సంతాపం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement