Thursday, May 2, 2024

Mahadabad – లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్ఐ సురేష్

మహమ్మదాబాద్ (ప్రభ న్యూస్)ప్రజలకు రక్షణ కల్పించవలసిన పోలీసులు భక్షకులుగా తయారయ్యారు . ప్రజలకు తక్షణ సేవలు అందించవలసిన పోలీసులు లంచ అవతారాలకు పాల్పడుతున్నారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సురేష్ నిందితుడు నుంచి 20వేలు లంచం తీసుకుంటున్నగా ఏసిబి డిఎస్పి కృష్ణ గౌడ్ సారథ్యంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది.

గండిడు మండలం పగిడాల గ్రామానికి చెందిన సిహెచ్ కృష్ణారెడ్డి ఇద్దరు కుమారులు ఉండగా చిన్న కుమారుడి వివాహ నిమిత్తం రిమాండ్ బెయిల్ చేసే క్రమంలో 50వేలు డిమాండ్ చేయగా అప్పట్లో 30వేలు ఇవ్వడం జరిగింది . బెయిల్ మీద బయటికి వచ్చిన తర్వాత ఎస్సై సురేష్ మరో 20 వేల కోసం ఒత్తిడి పెంచడంతో కృష్ణారెడ్డి కుమారులు ఆదివారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

ఎస్సై సురేష్ కు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ లంచం తీసుకుంటున్న కేసులు ఎస్సైతోపాటు సిబ్బంది ఇస్మాయిల్ కూడా ఉన్నారని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసిబి డిఎస్పి కృష్ణ గౌడ్ తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement