Sunday, May 5, 2024

నీట మునిగిన అండర్‌ గ్రౌండ్‌ బ్రిడ్జ్ …

దేవరకద్ర : మండల పరిధిలోని వెంకటయపల్లె గ్రామం వద్ద అండర్‌ గ్రౌండ్‌ బ్రిడ్జి రైల్వే కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం వల్ల తెల్లవారుజామున కురిసిన వర్షానికి స్వల్పంగా మునిగిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. అండర్‌ గ్రౌండ్‌ బ్రిడ్జి నిర్మాణం పనులు సక్రమంగా పూర్తి కాకపోవడంతో వాహనదారులు పరిస్థితి ఘోరంగా ఉంది. అండర్‌ గ్రౌండ్‌ బ్రిడ్జి వద్ద రాకపోకలకు పనులు సక్రమంగా లేకపోవడం వల్లనే వర్షానికి నీరు చేరడం వల్ల ఇబ్బందికరంగా ఉన్నాయని వాహనదారులు అంటున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు , ప్రజా ప్రతినిధులు శ్రద్ద తీసుకుని అండర్‌ గ్రౌండ్‌ బ్రిడ్జి పనులు సక్రమంగా చేసి వర్షపు నీరు నిల్వ లేకుండా.. వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటన ఇక్కడ చోటు చేసుకున్నాయని ప్రజలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement