Monday, May 20, 2024

హనుమాన్ తండాలో విషాదం.. నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

మహబూబ్ నగర్, క్రైం (ప్రభ న్యూస్) : మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం చిన్నదర్పల్లి గ్రామ శివారులోని హనుమాన్ తండాలో విషాదం చోటు చేసుకుంది. ఫిల్టర్ ఇసుక తయారీ కోసం ఏర్పాటు చేసిన నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం బోనాల పండుగ సందర్భంగా పాఠశాలకు సెలవు ఉండడంతో మూడవత్ శివ (9), కడావత్ గణేష్ (9) అనే ఇద్దరు చిన్నారులు తమ తండాకు సమీపంలో కొంతమంది అక్రమ ఇసుక వ్యాపారులు ఫిల్టర్ ఇసుక తయారీ కోసం ఏర్పాటు చేసిన నీటి కుంటలలో స్నానం చేయడానికి వెళ్లారు.

- Advertisement -

అయితే ఆ కుంట లోతు ఎక్కువగా ఉండడంతో చిన్నారులు నీటిలో మునిగి ఊపిరి అందక ఇరువురు ప్రాణాలు కోల్పోయారు. తమ పిల్లలు కనిపించడం లేదని ఆలస్యంగా తెలుసుకున్న కుటుంబ సభ్యులు పిల్లలను వెతకగా గ్రామ శివారులో నీటి కుంట సమీపంలో గడ్డపై దుస్తులు ఉండడం చూసి కుంటలలో వెతికారు. దీంతో చిన్నారుల ఇరువురి మృతదేహాలు కుంటలో లభ్యం కావడంతో కుటుంబ సభ్యులు తండావాసులు బోరున విలపించారు. తండాకు చెందిన ఇద్దరు చిన్నారులు పండుగ రోజు మృతి చెందడంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement