Thursday, April 25, 2024

కరోనా టైంలో పాడె మోసిన పోలీసులు

ఈ కరోనా కాలంలో సొంతవాళ్లు కూడా అంత్యక్రియలు చేసేందుకు వెనకాడుతున్నారు. అలాంటిది మహబూబ్ నగర్ జిల్లా పోలీసులు. ఓ అనాథ వృద్ధురాలి పాడె మోసి మానవత్వం చాటుకున్నారు. లాఠీ కాఠిన్యం వెనుక కారుణ్యం ఉందని, మనసున్న మనుషులమని చాటి చెప్పారు. అన్నీ తామై అంతిమ సంస్కారాలు నిర్వహించి అందరి మన్ననలు పొందారు. ఈ ఘటన వనపర్తి జిల్లా మదనాపురంలో చోటుచేసుకుంది.

మదనాపురం గ్రామానికి చెందిన శకుంతలమ్మ (80) అనారోగ్యానికి గురై శుక్రవారం కన్నుమూసింది. దహన సంస్కారాలకు వరుసకు కూతురైన లక్ష్మీ, ఆమె భర్త బంధువులకు ఎంత వేడుకున్నా ఎవరి గుండె కరగలేదు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ తిరుపాజి అంత్యక్రియలు తామే నిర్వహిస్తామని ముందుకొచ్చారు. దహన సంస్కారాలకు కావాల్సిన సామగ్రిని సమకూర్చారు. ఎస్‌ఐ, ట్రెయినీ ఎస్‌ఐ రాజశేఖర్, ఐదుగురు కానిస్టేబుళ్లు పాడెను మోసి.. అంత్యక్రియలు నిర్వహించారు. పోలీస్‌ సిబ్బంది కురుమయ్యగౌడ్, రవి, శివకుమార్‌రెడ్డి, స్వాములు, కలాం అంతిమ యాత్రలో పాల్గొన్నారు. పోలీసులు చేసిన ఈ పనికి ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement