Thursday, April 25, 2024

న్యూ లుక్: టీమిండియా కొత్త జెర్సీ

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ తుది దశకు చేరుకుంది. న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌లో గెలుపొందిన టీమ్ టైటిల్ సాధిస్తుంది. ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే ఇరు జట్లూ సంయుక్త విజేతలుగా నిలుస్తాయి. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ కొత్త జెర్సీలతో దర్శనమివ్వనున్నాయి.

టీమిండియాకు సంబంధించిన కొత్త జెర్సీని ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అభిమానులతో పంచుకున్నాడు. కొత్త జెర్సీ ధరించి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. రివైండ్ టు నైన్టీస్ అని కామెంట్ చేశాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ అని రాసి ఉన్న ఆ జెర్సీ 1990ల నాటి జెర్సీని పోలి ఉంది. జెర్సీ చాలా బాగుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement