Monday, April 29, 2024

పాఠశాలకు అధునాతన కంప్యూటర్..

నాగర్ కర్నూల్ : జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గతంలో ఉన్నటువంటి పూర్వ విద్యార్థి ఆర్ మధుసూదన్ పాఠశాలకు అధునాతన కంప్యూటర్ ను అందజేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి కురుమయ్య తెలిపారు. ఆయన మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు గతంలో చదివిన పాఠశాలను పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతున్న నందుకు పలువురు అభినందించారు. తాను గతంలో చదివిన పాఠశాలలో ఉపాధ్యాయులు అందించిన విద్యనే ఉన్నత స్థితికి కారణమైందని యునైటెడ్ నేషన్స్ ఆఫ్ అమెరికాలో నివాసముంటున్న అర్. మధుసూదన్ అన్నారు.
పాఠశాలకు నిత్య అభివృద్ధిలో ఉండటానికి పూర్వ విద్యార్థులు చేస్తున్న సహకారం మరియు తోటి ఉపాధ్యాయులు ఈ సేవా కార్యక్రమానికి ప్రోత్సహిస్తున్న తీరు ఎంతో బాగుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.కురుమయ్యా అన్నారు.
పాఠశాలకు కంప్యూటర్, మానిటర్, కీబోర్డ్, కంప్యూటర్ ప్రాసెసింగ్ యూనిట్, 40 వేల విలువగల పరికరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి. రవికుమార్ ,పి.శేఖర్ బాబు, హనుమంత్ రెడ్డి, శోభన్ బాబు, సుధాకర్ రెడ్డి , యాదగిరి శ్యామ్ సుందర్ రెడ్డి , భారతి, లలిత, పద్మ, డి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement