Friday, April 26, 2024

పశు వైద్యశాల నూతన భవనానికి నిధులు..

బిజ్వార్ : గ్రామం లో పశు వైద్యశాల పూర్తి శిథిలావస్థకు చేరుకోవడంతో పశువులకు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద చికిత్సలు నిర్వహిస్తుండడంతో నూతన భవనానికి నిధులు మంజూరు చేయాలని గ్రామపంచాయతీ సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదని ఆ గ్రామ సర్పంచ్ సావిత్రమ్మ వెంకట్ రెడ్డి అన్నారు. పశు వైద్యశాల నూతన భవనానికి నిధులు కేటాయించి పశువులకు మెరుగైన వైద్యం అందించాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, జిల్లా పశు వైద్య అధికారులకు వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. నిధులు మంజూరు అయిన వెంటనే భవనం నిర్మించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ విషయమై ఆంధ్రప్రభ పశువైద్యాధికారి మహాదేవ్ ను వివరణ కోరగా పశు వైద్యశాల నూతన భవనానికి అధికారులకు ప్రతిపాదనలు పంపించామని మంజూరు అయిన వెంటనే భవనం నిర్మిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement