Tuesday, April 30, 2024

MBNR: గుండెపోటుతో సంగంబండ సర్పంచ్ హఠాన్మరణం

మక్తల్, డిసెంబర్29 (ప్రభన్యూస్) గుండెపోటుతో ఓ గ్రామ సర్పంచ్ హఠాన్మరణం చెందిన సంఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని సంగంబండ గ్రామంలో ఇవాళ ప్రజా పాలన గ్రామసభ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, జెడ్పి చైర్ పర్సన్ కే .వనజ ఆంజనేయులు గౌడ్ హాజరయ్యారు.

గ్రామ సర్పంచ్ కె .రాజు అధ్యక్షతన జరిగిన గ్రామ పాలన సభలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు .అనంతరం ఆయన ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో స్థానికులు మక్తల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పాలమూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స ప్రారంభించిన కొద్ది సేపట్లోనే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో సంగంబండ లో విషాదఛాయలు అలుముకున్నాయి .మృతుడు సర్పంచ్ రాజుకు భార్య పదేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement