Sunday, April 28, 2024

AP BJP: సిగ్గుందా…కేంద్రం నుంచి నిధులు పొందుతూ సాయం అంద‌లేదంటారా…జ‌గ‌న్ ను నిల‌దీసిన పురందేశ్వ‌రి

కాకినాడ – మోడీ సర్కార్ భాగ్యస్వామ్యం లేకుండా రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగడం లేదు అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు కేంద్ర నుంచి నిధులు పొంద‌తూ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకారం అందించడం లేదని అపవాదు వేస్తున్నార‌ని ఫైర్ అయ్యారు.

కాకినాడ‌లో జర‌గిన బిజెపి బూత్ క‌మిటీ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి భారీగా నిధులు వస్తున్నప్పటి ఎలాంటి సహాయం అందడం లేదని జగన్ సర్కార్ చెప్పడం సిగ్గుచేటు అన్నారు. కార్యకర్తలను కలవాలని ఈ పర్యటనలు చేస్తున్నాన‌ని పేర్కొన్నారు. జిల్లాలలో రాజకీయ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాన‌ని ఏపీ బీజేపీ చీఫ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతలను నిర్వహిర్తించడం లేదు అని పురంధేశ్వరి ఆరోపించారు. ఇక, రాష్ట్రంలో స్మార్ట్ సిటీ నిధులు డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది అని అన్నారు. కాకినాడలో పెట్రో కెమికల్ కారిడర్ పెడతామని కేంద్రం ముందుకు వస్తే రాష్ట్రం ముందుకు రాలేదు అని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన బుద్ది చెప్పాలని ఆమె కోరారు. ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పురంధేశ్వరి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement