Wednesday, May 1, 2024

MBNR : వైభవంగా రథోత్సవ వేడుకలు..పాల్గొన్న ఎమ్మెల్యే

మక్తల్, ఏప్రిల్18(ప్రభన్యూస్) : నారాయణపేట జిల్లా కున్సి గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ ఉదయం స్వామివారి రథోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. అర్చకులు శ్రీకాంత్ చారి ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వేణుగోపాల స్వామిని ద‌ర్శించుకున్నారు. ర‌థోత్స‌వంలో పాల్గొని పూజ‌లు నిర్వ‌హించారు. అదేవిధంగా కొత్తపల్లి గ్రామంలో జరిగిన శ్రీ ఆంజనేయ స్వామి వారి రథోత్సవ వేడుకల్లోనూ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జి. లక్ష్మారెడ్డి ,కావాలి తాయప్ప ,ఆనంద్ గౌడ్ ,కున్సి నాగేందర్,గోవర్థన్, బిఆర్ఎస్ నాయకులు రాజుల ఆశిరెడ్డి, కొత్తపల్లి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement