Monday, April 29, 2024

రాగి జావ , పులిహోర ప్యాకెట్లు పంపిణీ

కోయిలకొండ : నారాయణపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ఎస్‌. రాజేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో అంబలి , పులిహోర ప్యాకెట్లను పంపిణీ చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా శ్రీరామ కొండపై జరిగే కల్యాణానికి వచ్చే భక్తులకు అంబలి , పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి తహశీల్దార్‌ శ్రీనయ్య , గ్రామ సర్పంచ్‌ కృష్ణయ్య , మాజీ సర్పంచ్‌ మంజుల , సురేందర్‌ , ఎంపిటిసి ఆంజనేయులు , ఉదయ్‌ రెడ్డి , శ్రీనివాసులు , కురుమయ్య , నర్సింలు , శ్యామ్‌ , హనుమంతు , అంజి , తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement