Monday, April 29, 2024

Gadwala : మహాబలేశ్వర్ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే బండ్ల

జోగులాంబ గద్వాల (ప్రతినిధి), జూన్ 28 (ప్రభ న్యూస్) : మహారాష్ట్రం కృష్ణానది జన్మస్థానమైన మహాబలేశ్వరం లోని మహాబలేశ్వర స్వామి దేవాలయం నందు స్వామి వారిని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి వారి ఆశీస్సులను పొందడం జరిగింది. భారతదేశం, తెలంగాణ రాష్ట్రం, గద్వాల నియోజకవర్గం సీఎం కేసీఆర్ పాలనలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతూ అన్నివర్గాల ప్రజలు కేసీఆర్ నాయకత్వంలో ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని మనస్పూర్తిగా స్వామి వారిని కోరుకోవడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే వెంట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ శ్రీధర్ గౌడ్, ఎంపీపీ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement