Thursday, April 25, 2024

అస్వస్థతకి గురైన కొత్త‌కోట ద‌యాక‌ర్ రెడ్డి.. పరామర్శించిన ఎమ్మెల్యే చిట్టెం

మక్తల్, (ప్రభన్యూస్)మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు .గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కొన్ని రోజులుగా హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిన ఆయన అభిమానులు నాయకులు ఆందోళన చెందుతున్నారు.అయితే ఆదివారం తెల్లవారుజామున దయాకర్ రెడ్డి స్వగ్రామం చిన్నచింతకుంట మండలంలోని పర్కాపురం గ్రామానికి ఆయనను కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పర్కాపురం వెళ్లి మాజీ ఎమ్మెల్యే దయాకర్రెడ్డిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు .అదేవిధంగా దయాకర్ రెడ్డి అభిమానుల తోపాటు పలు పార్టీలకు చెందిన పలువురు నాయకులు కూడా పర్కాపురం గ్రామానికి వెళ్లి దయాకర్ రెడ్డిని పరామర్శించారు .తీవ్ర అస్వస్థతకు గురైన తనను పరామర్శించేందుకు వచ్చిన తన అభిమానులను చూసి మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. కాగా ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement