Thursday, May 2, 2024

బీటీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు: మంత్రినిరంజన్ రెడ్డి..

పెద్దమందడి, (ప్రభ న్యూస్) : వనపర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు బీటీ రోడ్లు వేసేందుకు 9.60 కోట్లు మంజూరయ్యాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఖిల్లా గణపురం మండలంలోని మహమ్మద్ హుస్సేన్ పల్లి నుండి నిజాలాపూర్ కు నాలుగు కిలోమీటర్ల రహదారికి రూ. 3.30 కోట్లు పెబ్బేరు మండలం పాత పల్లి నుండి నాగసానిపల్లికి 2.10 కిలోమీటర్ల రహదారికి రూ.2.10 కోట్లు రేవల్లి మండలం నాగపూర్ నుండి గన్యాగులకు 4.60 కిలోమీటర్ల రహదారికి రూ.4.20 కోట్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement